Total Pageviews

Friday, December 29, 2017

జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర

జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర
ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

పురాణగాధ

బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది.[1] కురుక్షేత్రయుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానంజ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికిఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతున్నది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.

ఆలయ విశేషాలు

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.

రవాణా సౌకర్యాలు

హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్నిజామాబాద్ మరియు భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.
సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.
ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.
మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం.

పూజా విశేషాలు

ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రఒడిషామధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానికలు సమర్పించే ఆచారము ఉంది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. దర్శన వేళలు :- ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.3 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.3 గంటల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.3 గంటల నుండి 12.3 గంటల వరకు అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.3 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.3 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.3 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.

Saturday, August 26, 2017

మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం.


 పద్మాకారంలో ఆలయం. కింద గం గమ్మ.. మధ్యన రాజరాజేశ్వరి మాత..ఆ పైన త్రినేత్రుడు కొలువుదీరిన మహాద్భుతమైన చోటు. చుట్టూ పద్మరేకుల్లా చిన్నచిన్న శివాలయాలు.., రావి, వేప, మేడి చెట్లు అల్లుకొని త్రివృక్షమై బాసిల్లుతున్న ప్రాంతం..అదే మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం. కాకతీయుల కాలంలో నిర్మాణమైన ఈ ఆల యం దినదినాభివృద్ధి చెందుతూ..భక్తుల కొంగుబంగారమై అలలారుతోంది. ఈకోవెల 6తేదీ నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. -మహేశ్వరం

కాకతీయుల కాలంలో రాజరాజేశ్వరస్వామి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరం అని పేరు వచ్చింది. శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సందర్శకులను ఇట్టె కట్టిపడేస్తుంది. ఈ ఆలయ నిర్మాణం పద్మాకారంలో ఉంటుంది. దీనిచుట్టూ శ్రీహరిహరేశ్వరుడు, శ్రీమల్లీశ్వరుడు, శ్రీఅవిముక్తేశ్వరుడు, శ్రీఅఘోరేశ్వరుడు, శ్రీఅమరేశ్వరుడు, శ్రీఅమృతేశ్వరుడు, శ్రీగంగాధేశ్వరుడు, శ్రీఇష్టకామేశ్వరుడు, శ్రీముకేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీఏకాంబేశ్వరుడు, శ్రీమణికర్ణికేశ్వరుడు, శ్రీమహానందీశ్వరుడు, శ్రీఅమరావతీశ్వరుడు, శ్రీకాశీపతీశ్వరుడు, శ్రీమంగళగౌరీశ్వరుడు ఆలయాలు పదరేకుల్లా ఉంటాయి.

ఆలయంలోని అష్టాదశంగా (18 సంఖ్య వచ్చేలా) నిర్మించడం విశేషం. సహాజంగా శివుడి తలపై గంగ ఉంటుంది. ఇక్కడ మాత్రం గంగలోనే శివుడు ఉండడంతో ఆయన కింది భాగంలోనే రాజేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివగంగలో స్నానమాచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకం.

చరిత్రకు నిలువుటద్దం గడికోట
కాకతీయుల కాలం నాటి చరిత్రకు నిలువుటద్దంగా ఆలయం పక్కనే గడికోట నిర్మాణం నేటికీ నిలిచి ఉంది. కొంత శిథిలావస్థకు చేరినప్పటికీ కోటలోని కట్టడాలు నేటికి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గడికోట చుట్టూ ఆర్చ్‌లతో పాటు మధ్యలో ఉన్న కొలను ను అద్భుతంగా నిర్మించారు.

మహత్యం..త్రివృక్షం...:
ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర ఉంది. రావి, వేప, మేడి చెట్లు ఒకేచోట పెరగడంతో దీన్ని తివృక్ష చెట్టుగా పిలుస్తారు. పిల్లలు కానివారు ఈ చెట్లకు కొత్త కొబ్బరికాయ కట్టితే పిల్లలు పుడుతారని నమ్మకం. ఈవృక్షం కిందనే నాగేంద్రాలయం ఉంది.

శివగంగకు దారి ఇలా..:
ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలో మీటర్లు దూరంలో ఉంటుంది. ఫలక్‌నుమా, మిధాని, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ డిపోల నుంచి బస్సు సౌకర్యం ఉంది. జూబ్లీబస్ స్టేషన్ నుంచి మహేశ్వరానికి 253/ 90కె, చార్మినార్ నుంచి 253 ఎం, 253 కె, 253 టి, 253 హెచ్, సికింద్రాబాద్ నుంచి 8ఎ/ 253ఎం. జూబ్లీహిల్స్ నుంచి 253 ఎం, బస్సులు ఎక్కాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఔటర్‌రింగ్ రోడ్డు మీది నుంచి తుక్కుగూడ వరకు వచ్చి శ్రీశైలం రహదారి మీదుగా మహేశ్వరం గేట్ కమాన్ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చరిత్ర...
తానీషా నవాబుల వద్ద పని చేసిన అక్కన్న మాదన్నలు 1672లో వారి పర్యటనలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగాన 37 కిలో మీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. శంషాబాద్ మండలంలోని చిన గోల్కొండ, పెద్ద గోల్కొండ గ్రామాల మీదుగా అక్కన్న ,మాదన్నలు ఇక్కడికి చేరుకునేవారట.

మహేశ్వరం ఆలయంతో పాటు సమీపంలోనే కోదండరామస్వామి ఆలయం, శివగంగ పుష్కరిణి, విష్ణు భగవాన్, ఆంజనేయస్వామి ఆలయాలను సైతం అక్కన్న మాదన్నలు నిర్మించినట్లు ప్రతీతి . ఎనిమిదేళ్ల కాలంలో వీటి నిర్మాణం పూర్తయినట్లు చరిత్ర చెబుతోంది. 1677లో ఈ ఆలయం పునర్‌నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళ్లిన శివాజీ కూడా రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది. 1687లో ఔరంగజేబు దాడిలో గుడిని ధ్వంసమైనట్లు చెబుతుంటారు.

Friday, August 25, 2017

శక్తిపీఠాలు

శ్రీ సరస్వతీదేవి

Related Image అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది ... 'శ్రీ సరస్వతీ దేవి' శక్తి పీఠం. జమ్మూ కాశ్మీర్ లో వెలసిన ఈ శక్తి పీఠం పూర్వం మత పరమైన దాడులకు గురి కాసాగింది. అంతే కాకుండా ప్రకృతి పరమైన వైపరీత్యాల కారణంగా కూడా ఇక్కడి ఆలయం క్రమేణా శిథిలం కావడం మొదలైంది. దాంతో శ్రీ ఆది శంకరాచార్యుల వారు, అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి ... ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకు వచ్చారు. ఆ విజ్ఞాన శక్తిని శృంగేరి శారదాంబలో నిక్షిప్తం చేశారు.

అప్పటి నుంచి కాశ్మీర్ లోని సరస్వతి శక్తి పీఠాన్ని దర్శించాలనుకునే వారు, శృంగేరి శారదాంబను దర్శించడం జరుగుతూ వస్తోంది. ఇక్కడి అమ్మవారు భక్తుల పాలిట కామధేనువు ... కల్ప వృక్షమై కోరిన వరాలను ప్రసాదిస్తోంది.

ఈ భారీ వినాయకుడి గురించి తెలుసా?


కోయంబత్తూరు: వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఉండే సందడే వేరు. తొమ్మిదిరోజుల పాటు వూరూ వాడా.. పల్లె పట్టణం.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గణనాథుడి స్మరణలో మునిగిపోతారు. తమ శక్తి కొలదీ గణపతి విగ్రహాలను నెలకొల్పి పూజలు చేసి నిమజ్జనం చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఎన్నో వినాయక ఆలయాలున్నా కొన్నింటికి మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. అలాంటిదే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ముంతి వినయగర్‌ ఆలయం. కోయంబత్తూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో వినాయక విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందింది. 19 అడుగుల ఎత్తు.. 11 అడుగుల వెడల్పు.. 190 టన్నుల బరువుంటే ఈ విగ్రహం ఆసియాలోనే రెండో అతిపెద్ద ఏకశిలా విగ్రహంగా రికార్డులకెక్కింది. మామూలు రోజుల్లోనే భక్తులతో కిటకిటలాగే ఈ ఆలయం.. వినాయక చవితి రోజున ఇసుకేస్తే రాలనంతగా మారిపోతుంది. ఈ భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు.



ఉడిపి కృష్ణాలయం