ఈ భారీ వినాయకుడి గురించి తెలుసా?
కోయంబత్తూరు:
వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఉండే సందడే వేరు. తొమ్మిదిరోజుల
పాటు వూరూ వాడా.. పల్లె పట్టణం.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గణనాథుడి
స్మరణలో మునిగిపోతారు. తమ శక్తి కొలదీ గణపతి విగ్రహాలను నెలకొల్పి
పూజలు చేసి నిమజ్జనం చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఎన్నో వినాయక ఆలయాలున్నా
కొన్నింటికి మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. అలాంటిదే తమిళనాడులోని కోయంబత్తూరు
జిల్లాలో ఉన్న ముంతి వినయగర్ ఆలయం.
కోయంబత్తూరుకు
నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో వినాయక విగ్రహం ఎంతో ప్రసిద్ధి
చెందింది. 19 అడుగుల ఎత్తు.. 11 అడుగుల వెడల్పు.. 190 టన్నుల బరువుంటే
ఈ విగ్రహం ఆసియాలోనే రెండో అతిపెద్ద ఏకశిలా విగ్రహంగా రికార్డులకెక్కింది.
మామూలు రోజుల్లోనే భక్తులతో కిటకిటలాగే ఈ ఆలయం.. వినాయక చవితి రోజున
ఇసుకేస్తే రాలనంతగా మారిపోతుంది. ఈ భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు
ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు.
No comments:
Post a Comment